


కాల్షియం నైట్రేట్
ఇది కాల్షియం, నైట్రోజన్ లను కలిగి ఉండి, నీటిలో కరిగిపోయే ఎరువు. నీటిలో కరిగే కాల్షియంకు ఇదొక్కటే మూలం. కీలకమైన పోషకం అన్న సంగతి పక్కన పెడితే, ఇది మొక్కల్లో కొన్ని రకాల తెగుళ్లను కూడా నియంత్రిస్తుంది. ఇది వెంటనే నీళ్లలో కరిగిపోతుంది. బిందు సేద్యం, ఆకుల మీద పిచికారీ చేసే విధానాలకు అత్యుత్తమంగా ఉంటుంది. నీళ్ల కరిగే ఎరువును ఫలదీరణానికి సహాయపడేలా అభివృద్ది పరిచారు. ఈ ఎరువును వేయడానికి అనుసరించే ఒక పద్దతి, బిందు సేద్యం విధానంలో మొక్కలకు సరఫరా చేసేనీళ్లలో కలుపుతారు.
లాభాలు
అన్ని పంటలకు ఉపయోగకరం
మొక్క భౌతిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.
కొత్త చిగుళ్లు వేయడానికి, కొమ్మలు పెరగడానికి సహాయపడుతుంది.
మొక్కల వేర్లు, పూర్తి స్థాయి అభివృద్దికి సహాయపడుతుంది.
పూత పూయడానికి సహాయపడుతుంది.
నాణ్యమైన ఉత్పత్తికి భరోసా ఇస్తుంది.

కాల్షియం నైట్రేట్ ఎలా వాడాలి
ఈ ఎరువును ఉపయోగించడానికి, నిష్పత్తి, పంటలో వివిధ దశల్ని పరిగణలోకి తీసుకోవాలి. పువ్వులు ఏర్పడానికి ముందు నుంచి పండ్లు ఏర్పడే దశ వరకు వీటిని వాడటం మంచిది.
నీళ్లలో కరిగే ఎరువులను వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. దీనిని సరైన స్ప్రే నాజిల్ ఉపయోగించి ఉదయాన్నేలేదా సాయంత్రంపూట పిచికారీ చేయాలి. పంట, నేల స్వభావాన్ని బట్టి తగిన స్ప్రే వాడాలి, ఆకులు మొత్తం ఎరువులో తడవాలి.
ఎదిగిన పంటలకు అయితే, దీనిన డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి లేదా ఆకులు మీద స్ప్రే చేసే పద్ధతిని అనుసరించాలి. లేదంటే నేరుగా నేల మీద చల్లాలి.
ఎదిగిన పంటకు, కాల్షియం నైట్రేట్ రెండే లేదా మూడు సార్లు అవసరాన్ని బట్టి 25 నుంచి 50 కిలోలు వరకు ఉపయోగించాలి.
బిందుసేద్య పద్ధతిలో లీటర్ నీటికి 1.5 నుంచి 2.5 గ్రాముల చొప్పన కలపాలి. పంటను, నేల స్వభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
ఎరువును ఆకుల మీద పిచికారీ చేసే పద్ధతిని అనుసరిస్తే, పంటకు 30 నుంచి 40 రోజుల దశలో నీటిలో కరిగే కాల్షియం నైట్రేట్ (17-44-0)ని 0.5 నుంచి 0.8 శాతం గ్రాములు చొప్పన లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.