


ఎం.కె.పి (0:52:34)
ఇది నీటిలో కరిగిపోయే ఎరువు. ఇందులో అధిక మొత్తంలో ఫాస్ఫేట్, తగు మోతాదులో పొటాష్, సోడియం ఉంటాయి. ఇది వెంటనే నీటిలో కరిగిపోతుంది, బిందు సేద్యానికి ,ఆకుల మీద పిచికారీ చేసే విధానానికి బాగా పనిచేస్తుంది. నీటిలో కరిగే ఎరువుల(డబ్ల్యూఎస్ఎఫ్) ను ఫలదీకరణం* లో సహాయం చేయడానికి అభివృద్ది పరిచారు. ఈ పద్ధతిలో ఎరువులను, డ్రిప్ సిస్టమ్ ద్వారా అందించే నీళ్లలో కలిపేస్తారు.
లాభాలు
వేర్లు, గింజలు వేగంగా అభివృద్ధి చెందడానికి సహాపడుతుంది
మొక్కల్లో నిరోధక సామర్ధ్యాన్ని పెంచుతుంది
అధిక ధిగుబడిని ఇస్తుంది.
అంకురోత్పత్తి రేటు అధికంగా ఉండేలా చేస్తుంది
పంట సరైన సమయంలో పండేలా చేస్తుంది

ఎం.కె.పి. ఉపయోగించడం ఎలా
ఈ ఎరువుల్ని ఉపయోగించేటప్పుడు పంట విస్తీర్ణం, పంట దశ ను పరిగణలోకి తీసుకోవాలి. పంట తొలి దశ నుంచి పుష్పించడానికి ముందు దశ వరకు ఉపయోగించాలి. దీనిని డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో లేదా ఆకుల మీద పిచికారీ చేసే పద్ధతిలో పంటకు అందించవచ్చు.
డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో అయితే సూచించిన మోతాదులో ఎరువును వాడుకోవాలి. లీటర్ నీటికి 1.5 నుంచి 2 గ్రాముల ఎన్ పికె చొప్పున కలుపుకోవాలి, నేల స్వభావం, పంట రకాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
ఆకులు మీద స్ప్రేతో పిచికారీ చేసే పద్ధతి అయితే, విత్తిన 30, 40 రోజల తర్వాత నుంచి పూత వచ్చే వరకు మోనో అమ్మోనియం పాస్పెట్ (0-52-34) ను 0.5 – 1.0% నిష్పత్తిలో 10, 15 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి.