
అవగాహనడ్రైవులు
మట్టిని సంరక్షించుకుందాం
సుస్థిరమైన మరియు పర్యావరణ అనుకూల విధానాలను పెంచుకునేందుకు నేలకు పునరుజ్జీవం కల్పించడం, పంట ఉత్పాదకత పెంచడంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో మట్టిని సంరక్షించుకుందాం అనే ప్రచార కార్యక్రమం ప్రారంభించబడింది. మట్టి టెస్టింగ్, పునరుద్ధరణ & సంరక్షణ, సమతౌల్యంగా & సమీకృతంగా పోషకాల వినియోగం, జల వనరుల అభివృద్ధి & సంరక్షణ, పంటల విధానంలో పప్పు ధాన్యాలు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయంలో యాంత్రీకరణ మొదలైన వాటిని భాగం చేయడం ఈ ప్రచార కార్యక్రమం ఉద్దేశ్యం.
అవగాహన ఉద్యమంతో పాటు బయోగ్యాస్ యూనిట్, ఎంఐఎస్ – తుంపర సేద్యం సిస్టమ్లు, స్ప్రింక్లర్ సెట్లు, ప్లాస్టిక్ కప్పడం మరియు వ్యవసాయ సంబంధ యంత్రాలు వంటి యాంత్రీకరణ టెక్నాలజీల ఇన్స్టాలేషన్ కోసం రైతులకు ఆర్థిక సాయం కూడా అందించబడుతోంది.
ఈ ప్రచార కార్యక్రమం కింద – ప్రతి చుక్కకు మరింత పంట (మోర్ క్రాప్ పర్ డ్రాప్) - పేరిట ఇఫ్కో ప్రత్యేక నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. జల వనరులను అభివృద్ధి చేసుకోవడం మరియు సమర్ధంగా నిర్వహించుకోవడం, భూమిలో నీటి నిల్వలను మెరుగుపర్చుకోవడం మరియు మరింత ఎక్కువ ప్రాంతాన్ని సాగులోకి తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టబడుతోంది.
ఈ ప్రచార కార్యక్రమం ఎంతగానో విజయవంతం అయ్యింది. వివిధ పంటల సగటు దిగుబడులు 15-25 శాతం మేర పెరిగాయి. నేల సారం మెరుగుపడింది. మెరుగైన & సుస్థిరమైన వ్యవసాయ టెక్నాలజీల అమలుకు దోహదపడింది.